భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్తో కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు సమావేశం అయ్యారు. ఈ మేరకు దిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కోవింద్ నివాసానికి ఆయన చేరుకున్నారు. అయితే ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమేనని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ప్రత్యర్థి మీరాకుమార్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థిగా వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేయగా.. విపక్షాల తరఫు నుంచి గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్నారు.