ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సౌండింగ్ రాకెట్ లాంచ్ చేసింది. తటస్థ గాలుల్లోని వైఖరిలోని వైవిధ్యాలను, ప్లాస్మా డైనమిక్స్ స్టడీ చేసేందుకు శుక్రవారం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శ్రీహరి కోటలో లాంచ్ చేశారు.'తటస్థ గాలుల్లోని వైఖరిలోని వైవిధ్యాలను, ప్లాస్మా డైనమిక్స్ స్టడీ చేసేందుకు శుక్రవారం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శ్రీహరి కోటలో లాంచ్ చేశాం' అని ఇస్రో అఫీషియల్ అకౌంట్లో ట్వీట్ చేసింది. ఇస్రో కథనం ప్రకారం.. స్పేస్ రీసెర్చ్ కోసం రెండు స్టేజిల ప్రోపెల్లంట్ రాకెట్స్ వాడి ఉపరితల వాతావరణాలకు అనుగుణంగా తయారుచేశారు.
'కొత్త కాంపోనెంట్స్ లేదా సబ్ సిస్టమ్స్ ప్రొటోటైపులను టెస్టు చేసేందుకు లేదా.. వెహికల్స్, శాటిలైట్స్ లాంచ్ చేసేందుకు సరైన పరిస్థితులను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇస్రో 1965నుంచే సౌండింగ్ రాకెట్లను లాంచ్ చేస్తూ వస్తుందని ' ఇస్రో చెప్పింది.