ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీసుల్లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో తన శైలికి భిన్నంగా క్రీజ్ లో ఎక్కువ సేపు ఉన్నానని, పరుగులు చేసేందుకు ప్రయత్నించానని, అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పుడు పరుగులకంటే ఎక్కువ బంతులు ఆడగలగడమే తనకు సంతృప్తినిస్తోందని చెప్పాడు.
మనకు అలవాటు లేని పనులు సమర్థంగా చేయగలిగితే అదే ఒక చిన్నపాటి విజయంలాగా అనిపిస్తుంది. చివరి టెస్టులో 49 పరుగులే చేసినా 150 బంతులు ఆడాను. ఇప్పుడు నాకు టెస్టుల్లో సవాల్ ఎన్ని పరుగులు చేశానన్నది కాదు. ఎన్ని బంతులు ఆడానన్నదే ముఖ్యం. 100, 150, 200...ఇలా ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే సహజంగానే ఆపై పరుగులు వస్తాయి’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.