కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో భారీగా పేలుడు శబ్ధంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుళ్లపై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. భారీగా పేలుడు శబ్ధం వినిపించడంతో ఈద్గా నగర్, నరసింహ రెడ్డి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా పేలుళ్లకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.