టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటం చేయడంతో వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ టీడీపీ హయాంలో కట్టిన 8 లక్షల టిడ్కో ఇళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 నెలల జగన్ పాలనలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాలపై టీడీపీ ఎక్కడా కోర్టుకు వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ అవినీతిపై ఆధారాలున్నాయని.. సిట్, విజిలెన్స్తో దర్యాప్తు చేయించే ధైర్యం వైసీపీకి ఉందా? అని బోండా ఉమా ప్రశ్నించారు.