వచ్చే నెల 2న గాంధీ జయంతినాడు రాష్ట్రంలోని 35 షెడ్యూల్డు మండలాల్లో గిరిజనులకు ఆర్వోఎ్ఫఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటి స్థలాల సరిహద్దులను గుర్తించి రాళ్లను పాతి లబ్ధిదారులను వారికి కేటాయించిన స్థలాల వద్ద నిలబెట్టి ఫొటోలు తీయాలని కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా 16 బోధనాసుపత్రలను నిర్మించబోతున్నామని, వచ్చే నెల నాటికి వీటికి టెండర్లు ఖరారవుతాయని తెలిపారు. ‘నాడు-నేడు’ స్కూల్స్కు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు పదో అంశంగా వంటగదినీ చేర్చినట్టు సీఎం జగన్ తెలిపారు. అక్టోబరు 10న పాఠశాలలు తెరిచే వీలుందని, ఈ నేపథ్యంలో ఆయా పనులను ఈ నెల 30లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు-నేడు అమలు చేయాలన్నారు. అంగన్వాడీలను వైఎస్సార్ ప్రీపైమరీ స్కూల్స్గా మార్చబోతున్నట్టు తెలిపారు.