అంతర్వేది ఘటనలో నిరసనకారులపై పోలీసులు కేసులు పెట్టడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ హిందూ థార్మిక నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 15 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నామన్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ జరపాలని మాధవ్ డిమాండ్ చేశారు.