ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి విచ్చలవిడైపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 01:25 PM

తిరుపతిలో గంజాయి దందా పెరిగిపోయిందని, అందులో కూడా వైసీపీ నేతలకు వాటా వుందని చంద్రబాబు ఆరోపించారు.ఈ పరిస్థితుల నుంచీ తిరుపతిని కాపాడేందుకు సిద్ధమా అంటూ పదేపదే నగర వాసుల్ని ప్రశ్నించి సానుకూల సమాధానాలు రాబట్టారు. తిరుపతిపై పవన్‌ కళ్యాణ్‌కు సెంటిమెంట్‌తో కూడిన అభిమానముందని, ప్రధాని మోదీ తిరుపతిని పవిత్రంగా భావిస్తారని చెప్పారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తాము ముగ్గురూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.తిరుపతి ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌ను, తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com