ఒక్క చాన్స్ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, ఈ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని చిత్తుగా ఓడించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా, పాచిపెంట మండలంలోని శ్యామల గౌరీపురం, మంచాడవలస, విశ్వనాథపురం, పాంచాళి, పాచిపెంట గ్రామాల్లో ఆమె మంగళవారం ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో ఆమెకు ప్రజలు హారతులు ఇస్తూ పూలదండలు వేశారు. పాచిపెంటలో నిర్వహించిన ప్రచారంలో అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.