చంద్రబాబునాయడు, పవన్ సారథ్యంలో కేంద్రప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన రాబోతుందని టీడీపీ, జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. మాధవరాయుడుపాలెం గ్రామం చైతన్యనగర్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అన్నందేవుల చంటి సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కనకదుర్గా ఆలయంలో దుర్గాదేవిని దర్శించుకున్నా రు. అనంతరం చైతన్యనగర్లో ప్రతీ ఇంటికీ వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టో వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కావాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. యువత, మహిళా సాధికారిత అటకెక్కిందన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. జగన్ బటన్ నొక్కడం తప్ప ఎంతమంది ఖాతాల్లో సొమ్ములు జమచేశారని, ఎంత మం ది లబ్ధిదారులకు పథకాలు వర్తించాయని గోరంట్ల ప్రశ్నించారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు టీడీపీ సైకిల్గుర్తుపైనా, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థినిగా పోటీచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అన్నందేవుల చంటి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, గట్టి సుబ్బారావు, ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీను, కోఆప్షన్ మెంబర్ డాక్టర్ శ్రీను, అన్నందేవుల రాముడు, కొల్లిమళ్ళ వెంకటరమణ, అప్పల పాత్రుడు, డీవీవీ సత్యనారాయణ, కె.ఆదినారాయణ, బొల్లా ధనుంజయ(డీజే), షేక్ బషీర్, లింగరాజు, ఈశ్వరరావు, తాండారి రమణ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.