ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా ద్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 01:21 PM

 ప్రతి ఏటా జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేస్తామని, ఏపీని జాబ్‌ క్యాపిటల్‌గా తయారు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోక్‌శ్‌ చెప్పారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన యువగర్జనలో విద్యార్థులతో లోకేశ్‌ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందని చెప్పారు.అందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. విశాఖ జిల్లాను ఐటీ హబ్‌గా తయారుచేసి స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఐటీ మంత్రిగా పేరున్న కంపెనీలను తాను రాష్ట్రానికి తీసుకువస్తే.. వాటిని జగన్‌ తరిమేశారని ధ్వజమెత్తారు. 20వేల ఉద్యోగాలను కల్పించే అమరరాజా కంపెనీని తరిమేస్తే పక్క రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుందన్నారు.భూ కుంభకోణాలు, ఇసుక మాఫియా, డ్రగ్స్‌కు అడ్డాగా ఆంధ్రా మారిందని ప్రధాని మోదీ విమర్శలను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని జగన్‌ ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. భూములు.. ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంపై లోకేశ్‌ ధ్వజమెత్తారు. బొత్స, అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, చిన్న శ్రీను, ఎంపీ బెల్లాన చేస్తున్న అవినీతిని ఎండగట్టారు. జగన్‌ తీసుకువస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అత్యంత ప్రమాదకరమైనదని చెబుతున్న తమపై కేసులు పెట్టారన్నారు. జగన్‌ పెట్టే చిల్లర కేసులకు భయపడేది లేదని చెప్పారు. కుటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్టడీ సర్కిళ్లను తెరుస్తామని, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తామని లోకేశ్‌ చెప్పారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ‘హలో ఆంధ్రా.. బైబై వైసీపీ’ అంటూ లోకేశ్‌ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానాలు చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com