ఎన్నికల వేళ అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండాలని ఉరవకొండ ఎస్సై రాఘవేంద్రప్ప విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన వెలిగొండలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఎన్నికల వేళ అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.