ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దిరెడ్డి పొగరుబోతు. ఆంబోతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 01:16 PM

 ‘మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు వీళ్లే. ఇసుక, మద్యం, మైనింగ్‌ వ్యాపారాలు వీళ్లవే. ఇలా పెద్దిరెడ్డి కుటుంబం రూ.వేల కోట్లను దోచేసింది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పుంగనూరులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, పుంగనూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. పెద్దిరెడ్డి పొగరుబోతు. ఆంబోతులా తయారయ్యారు. కొమ్ములు విరిచేయండి. వీరి కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. పాపాల పెద్దిరెడ్డికి నిద్రలేని రాత్రులు చూపిస్తాం. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు మేలు చేసే వ్యక్తి. గతంలో రాజకీయపరంగా విభేదించామే తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. శివశక్తి డెయిరీ ద్వారా పుంగనూరు నియోజకవర్గ రైతుల్ని దోచేశారు. చివరికి మా హెరిటేజ్‌ను కూడా వీరి ప్రాంతానికి రానివ్వరు. మామిడి ధరల్ని తగ్గించి రైతులకు అన్యాయం చేసి.. అక్కడా కమీషన్లు తీసుకున్నారు. అనుమతుల్లేని రిజర్వాయర్ల ద్వారా రైతులకు అన్యాయం చేశారు. పెద్దిరెడ్డికి, కిరణ్‌కుమార్‌రెడ్డి పోలిక అస్సలు లేదు అని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com