సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుని.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ తిప్పలన్నీ కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఆయన చేస్తున్నారని ఆరోపించారు. అంటే హిందూ , టీడీపీ , బీజేపీ ఓటు బ్యాంక్ ఇన్ఫాక్టుగా చంద్రబాబు పొత్తుతో ఉండాలని.. మిగతా మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా జగన్ కార్నర్ చేసుకోగలిగితే.. ఈ రెండు ఓటు బ్యాంక్లు మళ్లీ మోదీకే లబ్ది చేకూరాలన్నది ప్రధాని స్ట్రాటజీ అని షర్మిల వ్యాఖ్యానించారు.