రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ రాక్షస పాలనకు అంతం తప్పదని నరసన్నపేట నియోజవకర్గ టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గతంలో తాను చేసిన అభివృద్ధికి మరింత రెట్టింపు చేస్తానని, గత పాలకులు సగంలో ఆపేసిన పనులను పూర్తిచేయిస్తానని తెలిపారు. నరసన్నపేట నియోజవర్గంలో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని, నరసన్నపేట పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.