చదరంగం స్వర్ణ విజేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అ అభినందనలు తెలిపారు చదరంగం ఒలింపియాడ్ లో రష్యాతో ఉమ్మడిగా భారత జట్టు బంగారు పతకం సాధించడం హర్షణీయమని చంద్రబాబు కొనియాడారు. భారత విజయంలో కోనేరు హంపీ, విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. భారత చదరంగం జట్టు అందరూ గర్వపడేలా చేసిందని నారా లోకేశ్ అభినందించారు.