కర్నూలు జిల్లా కౌతాళం మండలం పరిధిలోని పొదలకుంట గ్రామంలో శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ మారెమ్మ దేవి తుంగభద్ర నదికి (గుడికంబాలి) దగ్గరకు అమ్మ వారిని తీసుకొని వెళ్లడం జరిగింది. అక్కడ అమ్మ వారికి నది జలాలతో అభిషేకం నిర్వహించి దీప, ధూప,నైవేద్యం సమర్పించి తర్వాత అన్నదానం నిర్వహించారు.అక్కడ నుంచి అమ్మ వారితో పాటు తొళువు బిందెలతో పొదలకుంట గ్రామముకు ఊరేగింపుగా తీసుకు వచ్చారు .గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మ వారిని కనులారా వీక్షించి, నైవేద్యం సమర్పించడం జరిగింది. రాత్రి మారెమ్మ దేవి దగ్గర అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు .