అయోధ్యలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీచేతుల మీదగా జరిగిన భూమి పూజ కార్యక్రమాన్ని ఒ ఛానెల్ ప్రచారం చేయకపోవడం చారిత్రత్మాక తప్పిందం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్, టి ,ఐ ,సెల్, న్యాయవాది బోల్లిముంత విజయ్ కుమార్ అన్నారు, గురువారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే ,ప్రపంచంలో నే అతిపెద్ద ధార్మిక సంస్థ గా ఉన్న హిందూ ధర్మ ప్రచారంముఖ్య ఉద్దేశంగా ఉన్న తిరుమల తిరుపతిదేవస్థానానికి చెందిన ఎస్వీ, బి ,పి టివి ఛానెల్ ఎందుకు ప్రచారం చేయలేదని అయన.ప్రశ్నించారు,ఇటీవల ఎస్వీ, బి ,సి వివాదాలలో చిక్కుకుంటు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా చూస్తుందని విజయ్ కుమార్ ఆరోపించారు,వి ,ఐ ,పి ల సందర్శ న కార్యక్రమాలనుప్రచారం చేస్తున్న ఎస్వీ బి సి ,కోట్లాది మంది, దశాబ్దాల కల సాకారంఅయినా రామమందిరం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రచారం చేయకపోవడంలో కుట్రకోణం దాగివుందన్న అనుమానంను వ్యక్తం చేశారు,తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకునివిచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనిబోల్లిముంత విజయ్ కుమార్ డిమాండ్ చేశారు, ఈసమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మంచాల రత్నరాజు,భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమిరిశ ఆనంతచార్యులు,మహిళా మోర్చా అద్యక్ష ,కార్యదర్శి తోటకూర రేణుకదేవి ,గద్దెఉషానాయుడు ,జ్ఞాన కళావతితదితరులు ఉన్నారు.