ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతోన్న జీఎస్టీ కౌన్సిల్ 17వ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 18, 2017, 02:13 PM

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ లో జీఎస్టీ కౌన్సిల్ 17వ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రం తరపున మంత్రి కేటీఆర్ ఈ భేటీకి హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేటీఆర్ వివరిస్తారు. లాటరీలపై ఎంత శాతం పన్ను విధించాలనే అంశంతో పాటు ఎలక్ట్రానిక్ వే బిల్ వ్యవస్థపై నిబంధనలను రూపొందించడంపై చర్చ జరగనున్నది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం, బీడీ, గ్రానైట్ పరిశ్రమలను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి స్పష్టం చేయనున్నారు. చేనేత వస్త్రాలతో పాటు గార్మెంట్స్ తదితరాలపై కూడా  పన్ను తగ్గించాలని కోరనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com