ఏపీలో పలు చోట్ల ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. శ్రీకాకుళం పార్వతీపురంలో ఐటీడీఏ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ సత్యం ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. కర్నూలు, అనంతపురంలో డిప్యూటీ కలెక్టర్ సత్యం ఇంట్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో సత్యం ఇంట్లో రూ. 3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.కర్నూలులో 5 అంతస్తుల భవనం, అనంతపురంలో రెండంతస్తుల భవనం, హైదరాబాద్ లో ప్లాట్, ఆంద్రాబ్యాంక్ లో లాకర్ ఉన్నట్లు గుర్తించారు.