ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని అన్నారు. రాజధానిపై టీడీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అమరావతిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే అన్ని జిల్లాల టీడీపీ నాయకులతో కలిసి రాజధానిపై ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు.