ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటి రూపాయల లొట్టారీ తగిలింది.. ప్రాణానికే ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది..

national |  Suryaa Desk  | Published : Fri, Jan 03, 2020, 12:41 PM

ఇందిరా నారాయణన్... 70 సంవత్సరాల ఈ వ్యక్తి పేరు నిన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడాయన పేరు పశ్చిమ బెంగాల్ లో మారు మోగుతోంది. ఇటీవలే ఆయన్ను లక్ష్మీ దేవి కరుణించగా, కోటి రూపాయల లాటరీ తగిలింది. తన జీవితంలో ఎన్నడూ కోరుకోనంత డబ్బును ఒకేసారి చూడటంతో పాటు, అతనికి కష్టాలూ వచ్చేశాయి.


ఆదివారం అతనికి లాటరీ తగిలింది. ఈ విషయం బయటకు తెలియగానే, అతనికి బెదరింపులు మొదలయ్యాయి. ఒత్తిడి పెరిగింది. తన ప్రాణాలకు ముప్పు వచ్చిందని భావించిన నారాయణన్, ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా కల్నా పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆయన, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.


గతంలో బోర్లు వేసే పనిలో ఉన్న ఆయన, పదేళ్ల క్రితమే రిటైర్ మెంట్ తీసుకుని, నెలకు రూ. 10 వేల పెన్షన్ తీసుకుంటూ, ఈస్ట్ బురుద్వాన్ లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రూ. 60 పెట్టి, 10 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. "గుప్తిపారా మార్కెట్ నుంచి నేను వాటిని కొన్నాను. వాటిని నా జేబులో మడిచి పెట్టుకున్నానే తప్ప, ఫలితాలను కూడా చూడలేదు" అని నారాయణన్ వ్యాఖ్యానించాడు. తనకు టికెట్లను అమ్మిన లాటరీ సెంటర్ యజమాని మింటూ బిశ్వాస్, తనకు డబ్బులు వచ్చిన విషయాన్ని చెప్పాడని, తన షాప్ నుంచి కొన్న టికెట్లకు బహుమతి వచ్చిందని గుర్తించిన అతని ద్వారానే తనకు విషయం తెలిసిందని చెప్పాడు. అప్పటి నుంచి తనకు బెదరింపులు వస్తున్నాయని, అందుకే పోలీసు రక్షణ కోరుతున్నానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com