ఉగ్ర నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని పారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పాకిస్థాన్పై ఒత్తిడి పెరిగిందన్నారు. ఆ దేశమే ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి స్థాపన నెలకొల్పేందుకు పాక్తో కలిసి పనిచేస్తామన్నారు. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లో ఉండడం అంటే.. అది ఏ దేశానికైనా నష్టమే అని బిపిన్ రావత్ అన్నారు.