ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. జమ్మూకశ్మీర్ను భారత ప్రధాన స్రవంతిలో అనుసంధానించడంలో 56 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తి చూపిన ధైర్యం గత ప్రధానుల్లో ఎవరికీ లేదన్నారు. ఆదివారం ఆయన కోల్హాపూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్, ఎన్సిపి నేతలను ఆర్టికల్ 370 రద్దు చేసిన ఎన్డిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తారో లేదో ప్రశ్నించాలని షా ప్రజలను కోరారు. ఈ ఆర్టికల్ రద్దను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్నేత రాహుల్, ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ను లక్షంగా చేసుకుని ఆయన విమర్శించారు.