ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో వంటగ్యాస్ పేలి 6 గురుకి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 12:20 PM

చిత్తూరు జిల్లా మిట్టూరు ప్రాంతంలో ఇంట్లోని వంట గ్యాస్‌ సిలెండర్‌ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...మిట్టూరులో నివాసం ఉంటున్న ఓ ఇంట్లోని సిలెండర్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. దీన్ని గమనించని కుటుంబ సభ్యులు గ్యాస్‌ పొయ్యి వెలిగించేందుకు చేసే ప్రయత్నంలో పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. బాధితులను స్థానికులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com