థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఉద్దవ్ తనయుడు ఆదిత్య థాక్రే. ముంబై నగరంలోని వర్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చారు ఆదిత్య థాక్రే.
ఆదిత్య నామినేషన్ కార్యక్రమంతో …ముంబైలో కోలాహలం నెలకొంది. యువ నేతకు మద్దతుగా శివసేన కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం లభించింది. థాక్రే పై పూల వర్షం కురిపించారు స్థానికులు. రోడ్లకు ఇరువైపులా నిలబడి ఆదిత్యకు వెల్ కం చెప్పారు.