కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కొచ్చిన్ హౌస్లోమంగళవారం నాడు కలుసుకున్నారు. అనంతరం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇటీవల కేరళలో సంభవించిన భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, నేషనల్ హైవే 766 వెంబడి అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్ నిషేధం సహా పలు ఇతర అంశాలపై ఉభయులూ చర్చించినట్టు చెప్పారు. సుహృద్భావపూరిత వాతావరణంలో తమ సమావేశం జరిగినట్టు తెలిపారు.