న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురవవచ్చని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.మత్స్యకారులు మంగళవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు.