పంట వ్యర్దాలను తగులబెట్టకుండా సీఎన్జీ తయారీకి ఉపయోగించే ప్రకియ లూధియానాలో ప్రారంభమైందని, పండ్లు, కూరగాయల వ్యర్ధాలను బయో ఇంధనంగా మార్చే ప్రక్రియను మరో రెండు నెలల్లో మహారాష్ట్రలో ప్రారంభిస్తామని వివరించారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ . సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ కేవలం పంట వ్యర్ధాలకే కాకుండా మాంసం, చేపల వ్యర్థాలతోనూ సీఎన్జీ తయారు చేసి బస్సులు, వాహనాలను నడిపించవచ్చని తెలిపారు.
శిలాజ ఇంధనాల స్ధానంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ఎన్డిఏ సర్కారు కట్టుబడిఉందని మెథనాల్, కార్బన్ డయాక్సైడ్ను విడదీయడం ద్వారా లభ్యమయ్యే సీఎన్జీతో బస్సులు, వాహనాలను నడిపించవచ్చని తెలిపారు.