కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. పెట్టుబడులపై జరిగే 7వ భారత-యుఎఇ అత్యున్నత టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పీయూష్ గోయల్తోపాటు అబూధాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ హమద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొంటారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి వారు చర్చిస్తారు.