ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరి ప్రజలతో మమేకమైన చెర్రీ జంట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 01:15 PM

ధృవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీ ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా, రీసెంట్ గా కొల్లూరికి షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో చెర్రీ, సమంతలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఇక చెర్రీ కి తోడుగా ఉపాసన కూడా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చేసింది. అక్కడ కొల్లేటి అందాలను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. రీసెంట్ గా చెర్రీ-ఉపాసనలు పేరంటాలపల్లి , పాపికొండలు ప్రజలని కలిసి వారితో సరదాగా గడిపారు. వారి ఆదరణకి ఇంప్రెస్ అయిన ఉపాసన తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com