విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు… కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ తరఫున టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అమ్మఒడి’ పథకం మంచి కార్యక్రమమని… విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పేద విద్యార్థులను ఈ పథకం అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు… దాతలు ముందుకు రావాలని కేశినేని పిలుపునిచ్చారు. ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం జోరున 15 వేల రూపాయల సాయం అందించను న్నారు.