టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, కుట్రలు ఆపకపోతే జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబును కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి కూడా ఉందన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ విదేశాల్లో విలాసంగా తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఎలా ఉండేదని ప్రజలకు అర్థమైందన్నారు. జగన్ పాదయాత్ర విజయవంతం చేయడంలో చంద్రబాబు పాత్ర ఉందని, జగన్కు ఏమీ జరగకుండా భద్రత కల్పించారన్నారు.