అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపైన వివాదాలు రోజురోజుకూ ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. కృష్ణానది పోటెత్తడంతో ఆయన నివాసం వద్ద ఉన్న హెలీప్యాడ్, గార్డెన్ వరద ప్రవా హంలో మునిగాయి. దీంతో అధికార యంత్రాంగం చంద్రబాబు నివాసంతో పాటు కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తక్షణమే నివాసాలను ఖాళీ చేయాలంటూ కరకట్ట సమీపంలో ఉన్నవారికి ప్రభుత్వం శనివారం నోటీసులు ఇచ్చింది. దీనిలో భాగంగా చంద్రబాబు నివాసానికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు లు తీసుకునేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆ నోటీ సును గోడకు అంటించారు. కరకట్ట ప్రాంతంలో నిర్మించిన 32 నివా సాలకు ఉండవల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. గతంలో చంద్రబాబు అద్దెకు ఉం టున్న నివాసాన్ని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ సీఆర్డీయే నోటీసులు జారీ చేసిం ది. ఈ వ్యవహరం కోర్టుకు వెళ్లింది. గడిచిన రెండు రోజులుగా కృష్ణమ్మ పొంగి పొర్లుతుం డడంతో చంద్రబాబు నివాసానికి వరదనీరు చేరుతోంది. గంట గంటకు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రమాదాన్ని గుర్తించిన అధి కార యంత్రాంగం చంద్రబాబును తక్షణమే నివాసం ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది.