పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు, త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. దానిపై సోషల్ మీడియాలో స్పందించారు . ఆ తరువాత ‘‘నా సేవలు జనసేన అధినేతకు అవసరం అయ్యే వరకు అదే పార్టీలో ఉంటాను. ఇలాంటి పుకార్లతో మీ సమయాన్ని వృథా చేసుకోకండి. ఆ సమయాన్ని వరద బాధితులకు సహాయం చేస్తూనో, మొక్కలను నాటడానికో, ప్లాస్టిక్ను తొలగించేందుకో, యువతలో స్ఫూర్తిని కలిగించేందుకో ఉపయోగించండి. జై హింద్’’ అని ట్వీట్ చేశారు.