ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుకార్లతో సమయాన్ని వృథా చేసుకోకండి : జేడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2019, 06:10 PM

పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు, త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. దానిపై సోషల్ మీడియాలో స్పందించారు . ఆ తరువాత ‘‘నా సేవలు జనసేన అధినేతకు అవసరం అయ్యే వరకు అదే పార్టీలో ఉంటాను. ఇలాంటి పుకార్లతో మీ సమయాన్ని వృథా చేసుకోకండి. ఆ సమయాన్ని వరద బాధితులకు సహాయం చేస్తూనో, మొక్కలను నాటడానికో, ప్లాస్టిక్‌ను తొలగించేందుకో, యువతలో స్ఫూర్తిని కలిగించేందుకో ఉపయోగించండి. జై హింద్’’ అని ట్వీట్ చేశారు.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com