అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థతో సివిల్ సప్లైస్ పని తీరు గాడినపడుతుందన్నారు. రైస్ మిల్లర్లు కొనే ధాన్యంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు.