అమరావతి: జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు కేంద్ర విద్యుత్ సంస్థలు ఝలక్ ఇచ్చాయి. విద్యుత్ ఒప్పందాలపై సమీక్షకు హాజరు కాకూడదని ఎన్టీపీసీ, ఎస్ఈసీఐలు సంస్థలు నిర్ణయించాయి. ఇవాళ ఒప్పందాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఒప్పందాలను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిస్కమ్ లకు ఎస్ఈసీఐ లేఖ రాసింది.