విజయవాడ, సూర్య బ్యూరో : రాబోయే వేసవి కాలంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్ధాయి కార్యాచరణ ప్రణాళికలతో ఆధికారులను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంత్రి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దిశానిర్ధేశంతో వేసవి కాలపు త్రాగునీటి కార్యాచరణ, జల సంరక్షణ కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళుతున్నామన్నారు. ఏ గ్రామం లో కురిసిన వాన నీరు అదే గ్రామంలో భూగర్భజలాలుగా రూపాంతరం చెందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ఏఏ గ్రామాలలో త్రాగునీటిని రవాణా వ్యవస్ధ ద్వారా, ట్యాంకర్ల ద్వారా అందిచాల్సి ఉందో అందుకు అనుగుణంగా ఆధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను తెలుపుతూ ఇప్పటివరకు 6 కోట్ల ఘనపు మీటర్ల పైగా పనులను నిర్వహించామని, స్పిల్వే లెప్ట్ బ్యాంక్, ఆప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్ల విభాగాలలో ఆ పనులను చేపట్టామని మంత్రి దేవినేని తెలిపారు. ఇంకా 407.24 లక్షల ఘనపు మీటర్ల ్తవ్వ్రక పనులను చేపట్టాల్సిన ఉందన్నారు. నీరుచెట్టు, నీరుప్రగతి కార్యక్రమం ద్వారా గత రెండేళ్లల్లో మొత్తం 47.60 కోట్ల ఘనపు మీటర్ల చెరువు పూడిక పనులను చేపట్టామన్నారు. ఎత్తిపోతల పధకాల విధానంలో భాగంగా నూతనంగా 88 ఎత్తుపోత్తల పధకాలను పూర్తిచేసి 1,18,187 ఎకరాల నూతన అయూకట్టుకు సాగునీరు వసతి అందించగలిగామన్నారు. ప్రయోగాత్మక బోర్వెల్ పధకం క్రింద ఎస్.సిల వారికి 381 బోర్లు, ఎస్.టిల వారికి 128 బోర్లు అందుబాటుల్లోకి తీసుకువచ్చామన్నారు. ఎన్.టి.ఆర్ జలసిరి క్రింద 56,476 స్ధలాలలో భూగర్భ జల సర్వేలను నిర్వహించి వాటిలో 37,807 అనువైనవిగా గుర్తించి సిఫార్సు చేశామన్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వాతావరణ సమాచా రాన్ని రైతుల అరచేతిల్లోకి తీసుకురావడం ద్వారా భూగర్భజలస్ధాయి, తదితర విషయాలు ఎప్పటికపడు తెలుసుకునే సౌలభ్యాన్ని రైతులకు అందుబాటుల్లోకి తెచ్చామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 1800 ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాలు, 1254 పిజో మీటర్లతో పాటు ఇస్రో, ఎన్.డి, ఎస్.సి, వాసర్ల్యాబ్స్ సాంకేతిక పరిజ్ణానంతో సి.యం డ్యాష్ బోర్డులో, వాతావరణ సమాచార యాప్ ద్వారా అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రాబోయే 7, 8 రోజుల పాటు రాష్ట్రంలోని ఉష్లోగ్రతలు వివరాలను ఎప్పటికపడు తెలుసు కునే అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చు కోవాలని మంత్రి సూచించారు.