హైదరాబాద్ : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు ముందుగా బ్యాంక్ ఉద్యోగులు, మేధావులతో సమావేశమవుతారు. అనంతరం పాతబస్తీలోని దళిత వాడలో సహపంక్తి భోజనం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు బిజెపి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి బిజెపి ఆఫీస్ బేరర్ల
సమావేశంలో పాల్గొంటారు.