ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని బసంత్పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలింగ్ విధులు నిర్వహించేందుకు ఈవీఎంలు తీసుకుని వెళుతున్న సిబ్బంది ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో పోలింగ్ ఆఫీసర్ మృతి చెందగా, మరో ఐదు మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.