ఢిల్లీ: లోక్సభ ఎన్నికల సమరాంగణంలో మూడో విడుత పోరుకు సర్వం సిద్ధమైంది. 12 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగనుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితర ప్రముఖులు మూడో విడుత బరిలో ఉన్నారు. గుజరాత్ (26), కేరళ (20)లోని అన్ని లోక్సభ స్థానాలతోపాటు, అసోం- 4, బీహార్- 5, ఛత్తీస్గఢ్- 7, కర్ణాటక- 14, మహారాష్ట్ర- 14, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 10, పశ్చిమ బెంగాల్- 5, గోవా- 2, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, త్రిపురలో ఒక్కో లోక్సభ సీటుకు ఈ విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి.