ఏటీఎస్ చీఫ్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రచారంలోకి వచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ప్రస్తుతం బీజేపీ తరపున భోపాల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. తన శాపం వల్లే కర్కరే ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారంటూ అమె చేసిన వ్యాఖ్యలు వివాదం కావటంతో ఈసీ నోటీసులు జారీ చేసిన మరుక్షణమే తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి . కొద్ది గంటలు పూర్తి కాకముందే మరో మారు ఈసి ఆగ్రహానికి గురయ్యారు.
‘బాబ్రీ మజీద్ కూల్చివేతలో నేను పాల్గొన్నందుకు గర్వంగా ఉంది.’ అంటూ ఆమె వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ భగ్గుమంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ కేసు నమోదు చేయడంతో పాటు ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
.