విజయవాడ, సూర్య బ్యూరో : పదోన్నతులు పొందిన పంచాయతీ కార్య దర్శులకు పోస్టింగులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు పి.అశోక్బాబు, ఎ. విద్యాసాగర్లు జిల్లా కలెక్టర్ను కోరారు. పంచాయతీ శాఖ కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై శనివారం ఉదయం ఉద్యోగసంఘాల జెఎసి రాష్ర్ట అధ్యక్షులు పి.అశోక్బాబు, జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్తోపాటు పలువురు ఎన్జీవో నేతలు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ గ్రూప్3 నుండి గ్రూప్2, గ్రూప్2 నుండి గ్రూప్1 గా ఏడాది క్రితం పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటివరకు పోస్టింగ్లు కేటాయింపు జరగలేదని వెంటనే పోస్టింగులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకొచ్చారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో 8 కిలోమీటర్ల లోపు పనిచేస్తున్న రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఇంటఇద్దె భత్యాన్ని 12 శాతం నుండి 14.5 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేసినప్ప టికి అమలు కావడం లేదన్నారు. జిల్లా కలెక్టరు బాబు. ఎ స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లపడు సిద్దంగా వుంటానని తెలి పారు. పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులకు ఏప్రిల్ మొదటి వారంలో పోస్టింగులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తానన్నారు. కోరాడ పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న వారు ఎంతటి వారైనా తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నా మన్నారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఎన్జీవో నేతలు పి.అశోక్బాబు, ఎ.విద్యా సాగర్, ఎం.డి ఇక్భాల్, పి. రమేష్, వేమూరి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు ఎ. శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి డి.ఎస్.ఆర్ ఆంజనేయులు, కోశాధి కారి ఎ.ఎస్.ఆర్ కోటేశ్వరరావు, కె.రాధాకృష్ణ, ఎం.డి భాషా తదితరులున్నారు.