చినగంజాం నుండి వెళుతూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఉదంతంపై రవాణాశాఖాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. ఒక మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్, ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అగ్నికీలలు చెలరేగి ఆరుగురు మృతి చెందడం తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ ఆయిల్ ట్యాంక్ ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని రవాణా శాఖాధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.