ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతా మండలిలో శాశ్వత సభ్వత్వం భారత్ హక్కు.. బ్రిటన్ మాజీ ప్రధాని

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:41 PM

ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొవడానికి భారత్ దృక్పథం అవసరమని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత స్థానం దకాల్సిందేనని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామోరూన్ స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా ఓ జాతీయ మీడియా సోమవారం నిర్వహించిన ప్రపంచ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని పాల్గొన్నారు. మోదీ ప్రసంగించిన అనంతరం కామెరూన్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచానికి బలమైన ఆర్థిక వృద్ధి, మరింత ప్రజాస్వామ్యం, గ్రీన్ టాన్సిషన్ అవసరం. ఈ మూడింటికి భారత్ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.


‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అద్బుతం.. మూడోసారి మీరు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ శక్తి మరింతగా ఆకట్టుకుంది.. నేను రెండుసార్లు ప్రధాని అయ్యాను (బ్రిటన్ ప్రధాని) ఆ తర్వాత చాలా మంది ప్రధానులయ్యారు..టోనీ బ్లెయిర్, మార్గరేట్ థాట్చర్‌కు ముందు మాకు మూడుసార్లు వరుసగా ప్రధాని అయిన వ్యక్తులు లేరు.. మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత మరింత ప్రభావం చూపుతున్నారు. ఎందుకంటే నిజమైన సామర్ధ్యంతో ముందుకు వెళ్తున్నారు’ అని కామెరూన్ అన్నారు.


‘రెండో ప్రపంచ యుద్ధానంతం ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో సమూల మార్పులు చేయాల్సి ఉందని ఎందుకంటే ఈ 80 ఏళ్లలో ప్రపంచం ఎన్నో మార్పులకు గురైందని అన్నారు. ‘ఈ శతాబ్దంలో వృద్ధి పథంలో పయనిస్తోన్న భారత్.. ఒకొనొక దశలో అతిపెద్ద ప్రపంచ ఆర్దిక వ్యవస్థగా మారనుంది.. కాబట్టి ఐరాసలో మార్పులు చేపట్టి.. భారత్ వంటి దేశాలకు కీలక స్థానం కల్పించాలి’ అని బ్రిటన్ మాజీ ప్రధాని అన్నారు.


భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని 2015లో తాను చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు కామెరూన్ సమాధనం ఇస్తూ.. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాల్సి ఉంది.. 2015కు ముందే నేను ఈ వాదన తెరపైకి తెచ్చారు.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐరోపా వెలుపల నా మొదటి పర్యటన భారత్‌లోనే.. ఈ శతాబ్దం భారత్‌దే అని నేను ముందుగానే ఊహించాను.. మార్పులు సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ హక్కు.. ఈ విషయంలో మరో మాటలేదు’ అని కామెరూన్ స్పష్టం చేశారు.


అలాగే, క్వాడ్, జీ20 వంటి కూటమిల్లో భారత్ చేరడం శుభపరిణామమని, జీ7 కూటమి సమావేశాలకు భారత్‌ను ఆహ్వానిస్తున్నారంటే అందులో ఓ సభ్యదేశంగా దాదాపు చేరినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని నివారించే సత్తా.. మధ్యవర్తిత్వం వహించే సామర్ధ్యం కూడా భారత్‌కు ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com