బేస్తవారిపేట పట్టణంలోని బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు, కంభం సర్కిల్ సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో ఇరు పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 అసెంబ్లీ ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేందుకు సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఎన్నికల గురించిన తర్వాత అల్లరిలకు పాల్పడకుండా కార్యకర్తలకు సర్ది చెప్పాలని నాయకులకు చెప్పారు.