అమరావతి : కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని, అఖిలప్రియకు ఇంత చిన్నవయస్సులో పెద్ద కష్టం వచ్చిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత సునీత అన్నారు. ముందుగా భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించారు. అప్పట్లో తన భర్త అయిన పరిటాల రవి చనిపోతే చంద్రబాబు తమ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచి, తమను అన్ని విధాలా ఆదుకున్నారని, అదేవిధంగా ఇప్పుడు అఖిలప్రియ కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టిడిపి నాయకులు, మంత్రులంతా అఖిలప్రియ కుటుంబానికి అండగా నిలుస్తామని ఆమె పేర్కొన్నారు.