న్యూదిల్లీ: అండమాన్-నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం భారీ భూకంపం వచ్చింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. ఉదయం 8.21 నిమిషాల సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కానీ సునామీ హెచ్చరికలు జారీ చేసేంత తీవ్రత దీనిలో లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.