ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కారం చల్లిన అనిల్కుమార్ శర్మ అనే 40 ఏళ్ల వ్యక్తికి మతి స్థిమితం సరిగ్గా లేదని పోలీసులు చెప్పారు. కేజ్రీవాల్ కార్యాలయానికి వచ్చిన శర్మ ఒక లేఖ ముఖ్యమంత్రికి ఇవ్వాలని లోపలికి వచ్చాడు. కేజ్రీవాల్కు లేఖ ఇచ్చిన తరువాత ఆయన కాళ్లకు నమస్కరించాడు. ఆ సమయంలో అతడి జేబులోనుంచి కొంత కారం కింద పడింది. మిగిలిన కారాన్ని అతడు కేజ్రీవాల్ ముఖంపై చల్లాడు. ఈలోగా అక్కడ కాపలా ఉన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. శర్మను అరెస్టు చేసి అతడిపై కేసు నమోదు చేశామని, అయితే ముఖ్యమంత్రి కార్యాలయంనుంచి తమకు ఇప్పటి వరకూ ఫిర్యాదు ఏదీ అందలేదని పోలీసులు చెప్పారు.