కాకినాడ: అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేయడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నాలుగో వార్డ్ లో నిర్వహించిన నగర్ దర్శిని నగర వికాసం కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నాయి బ్రాహ్మణ కాలనీ లో 10 లక్షలతో నిర్మించతలపెట్టిన సామాజిక భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పెద్దాపురంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి చినరాజప్ప వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.